రూపాయి నోటుకు వందేళ్లు పూర్తి..! చెన్నై: రూపాయి నోటు రూపొందించి బుధవారంతో వందేళ్లు పూర్తైంది. రూపాయ నోటా అని చులకనగా మాట్లాడినప్పటికీ ఇతర నోట్లు రూపొంద డానికి ఈ నోటే ఆదర్శవంతంగా వుంది. 1917 నవంబర్ 30న రూపాయి నోటును ప్రవేశపెట్టారు. నాటి వర్తకులు ఈ నోటును తమ అవసరాలకు విరివిగా వినియో గించారు. కోయంబత్తూర్ మాజీ తపాలా శాఖ అధికారి హరిహరన ఈ పాత నోట్లను భద్రంగా తన వద్ద దాచుకున్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ, మొదటి రూపాయి నోటు ఇరువైపులా ఐదవ జార్జ్ ప్రభువు ఫొటో ముద్రించి వుంటుందని, 1935 ఏప్రిల్ 1వ తేదీన రూపాయి నోటు ముద్రణకు అనుమతిని భారత రిజర్వ్ బ్యాంక్కు ఆంగ్లేయులు అప్పగించారని తెలిపారు. అనంతరం ముద్రితమైన మొదటి రూపాయ నోటులో మొదట 8 భాషలు మాత్రమే వుండేవని, 1940లో ముద్రించిన నోటుపై 6వ జార్జ్ ఫొటోను ముద్రించారని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం బాధ్యతలు స్వీకరించిన ఆర్థిక మంత్రి పర్యవేక్షణలో ముద్రించిన రూపాయి నోటు ప్రజాదరణ పొందిందన్నారు. 1949లో ఆర్థిక శాఖ కార్యదర్శి కేఆర్కే మేనన్ సంతకం చేసిన నోటుపై మొట్టమొదటిగా అశోకుడి స్తూపం చోటుచేసుకుందని, 1951లో హిందీలో
కబాలి 2లో మరో కొత్త లుక్ లో రజనీ సూపర్ రజనీకాంత్ హీరోగా ఘనవిజయం సాధించిన సినిమా కబాలి. ఎక్కువగా స్టార్ డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు చేసే రజనీ తొలిసారిగా ఓ కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా రజనీ మార్కెట్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేసింది. అందుకే కబాలి ఫీవర్ నడుస్తుండగానే ఈ సినిమాకు సీక్వల్ ఉంటుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్టుగా సమాచారం. మరోసారి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమాకు సీక్వల్ చేస్తున్నాడు రజనీ. ఈ సినిమాను రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 2.0 పనుల్లో బిజీగా ఉన్న రజనీ కబాలి సీక్వల్ పని కూడా మొదలెట్టేశాడు. ఇటీవల రజనీని కలిసిన దర్శకుడు పా రంజిత్, సీక్వల్ లో రజనీ లుక్, కాస్ట్యూమ్స్ పై చర్చించాడు. త్వరలోనే కబాలీ 2 సెట్స్ మీదకు వెళ్లనుందన్న టాక్ వినిపిస్తోంది.
పవన్,త్రివిక్రమ్ చిత్రంలో మరో స్టార్ హీరో, ఎవరంటే 'కాటమరాయుడు' సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు 'దేవుడే దిగి వచ్చినా' అనే టైటిల్ సైతం ప్రచారంలో ఉంది. ఈ చిత్రం గురించి ఇప్పుడో హాట్ న్యూస్ చెప్పబోతున్నాం. మీరు విని ఆశ్చర్యపోయే న్యూస్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఉపేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఆ అనుబంధంతో వెంటనే ఓకే చేసినట్లు చెప్తున్నారు. ఇక అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ తాతగా చేసిన బొమన్ ఇరానీ నిసైతం ఈ సినిమా కోసం తీసుకున్నారు. కుష్బు మరో కీ రోల్ లో కనిపించనుంది. జనవరి 2017 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా చేయనున్నారు.
Comments
Post a Comment